మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఈవీల తయారీలో వెనక్కి తగ్గడం లేదు ఆటో సంస్థలు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొన్ని విద్యుత్ వాహనాలను భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. ఒక్కసారి చార్జింగ్తో 750 కి.మీ ప్రయాణించే విద్యుత్ కార్లను తయారు చేయనున్నట్లు ఫాక్స్కాన్ తె లిపింది. హాన్ హరు ప్రెసిషన్ ఇండిస్టీగా సుపరిచితమైన ఫాక్స్కాన్.. యాపిల్, ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల కోసం స్మార్ట్ఫోన్లను రూపొందించేంది. కాంట్రాక్టు పద్ధతిలో వాహన సంస్థల కోసం విద్యుత్ కార్లను రూపొందించనున్నట్లు ఫాక్స్కాన్ తెలిపింది.
ఇతర ఖాతాదారులుగా స్టెల్లాంటిస్, ఫియట్ క్రిస్లర్, పిజియోట్ల విలీన సంస్థలు ఉండొచ్చని గతవారం తైవాన్ పత్రిక పేర్కొంది. కానీ దీన్ని ‘లూ’ ధ్రువీకరించలేదు. ఫాక్స్కాన్ మొదటి విద్యుత్ బస్సు ‘మోడల్ టీ’పై ఒకసారి ఛార్జింగ్తో 400 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చని తెలిపింది.
యాపిల్, ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేసే ఫాక్స్కాన్ విద్యుత్ కార్లను ఉత్పత్తి చేసే ప్రణాళికలను ప్రకటించింది. కాంట్రాక్టు పద్ధతిలో వాహన సంస్థల కోసం విద్యుత్ కార్లను ఫాక్స్కాన్ తయారుచేయనుంది. చైనా, ఉత్తర అమెరికా, ఐరోపా, ఇతర విపణుల్లో వాహన సంస్థలకు కార్లు, బస్సులను ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ ఉత్పత్తి చేస్తుందని, మార్కెట్కు అనుగుణంగా ఖాతాదారులు డిజైన్, ఫీచర్లను మార్చుకోవచ్చని సంస్థ ఛైర్మన్ యంగ్ లూ వెల్లడించారు. హాన్ హయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీగా సుపరిచిమైన ఫాక్స్కాన్.. విద్యుత్ వాహనాల ఉత్పత్తి కోసం పలు వాహన సంస్థలు, ప్రతిష్ఠాత్మక స్టార్టప్ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇటలీ సంస్థ పినిన్ఫార్నియా అభివృద్ధి చేసిన ‘ఇ సెడాన్’ మోడల్ను 2023లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.