స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణంను తట్టుకోలేక అభిమానులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. కర్ణాటకలోని బెలగావి జిల్లా లో రాహుల్ అనే పునీత్ అభిమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే రాయచూరు జిల్లా లో కూడా ఇద్దరు అభిమానులు బసవ గౌడ్, మహమ్మద్ రఫీవిషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ ఒకరు చనిపోయినట్లు సమాచారం. మరోవైపు చామరాజనగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే అభిమాని టీవీ చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు .
చామరాజునగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే పునీత్ అభిమాని టీవీ చూస్తూ గుండెపోటుతో మరణించాడు. ఉడుపి జిల్లాలో సతీష్ అనే రిక్షా కార్మికుడు తన అభిమాన నటుడు పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తుండగా రిక్షాలోని కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అభిమాన నటులు చనిపోవడం బాధ కలిగించే విషయమే అయినా అభిమానులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని పలువురు సినీ ప్రముఖులు సూచిస్తున్నారు. గుండె ధైర్యంతో మెలగాలని హితవు పలుకుతున్నారు.